ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాట్ చేసే కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఫీచర్ను మోసగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని భావించి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు ఆదేశించింది.
అప్పటి వరకు ఈ ఫీచర్ను భారత్లో విస్తరించవద్దని సూచించినట్లు సమాచారం.
ప్రజల గోప్యతతో పాటు భద్రత కూడా కాపాడాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
