2000 నుండి 2015 మధ్య భారత్లో యాంటీబయాటిక్ వాడకం రెండింతలకు పైగా పెరిగింది. అంటే గతంలో 320 కోట్ల డోసుల వాడకం నుండి ఇప్పుడు 650 కోట్ల డోసులకు చేరింది.
ప్రపంచవ్యాపగా వాడే యాంటీబయాటిక్స్లో సగం మాత్రమే సరైన కారణాలతో వాడుతున్నారు. మిగతా సగం అనవసరంగా వాడుతున్నారు. 
భారత్లోని పట్టణ ప్రాంతల్లో, ప్రిస్క్రిపన్ లేకుండానే మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ ఇచ్చే రేటు దాదాపు 67% ఉంది. అంటే Doctor దగ్గరకు వెళ్లకుండానే మందులు కొనేసుకుంటున్నారు.
