తమిళనాడు ముఖ్యమంత్రి Vijay కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా, ఈ పథకానికి మళ్లీ మహాత్మా గాంధీ పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఆయన ప్రధానంగా చేసిన విజ్ఞప్తులు:
- కొత్త పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని కోరారు. గాంధీజీ పేరు తొలగించడం తగదని విజయ్ అభిప్రాయపడ్డారు.
- గ్రామీణ ఉపాధి పథకంలో కూలీల వేతనాలు, పరిపాలనా ఖర్చులను 100% కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని విజ్ఞప్తి చేశారు.
- పథకం వల్ల గ్రామీణ పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పాత పథకం స్ఫూర్తిని కొనసాగించేలా మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు.
“మహాత్ముడే మనకు మార్గదర్శి. అందుకే గ్రామీణ ఉపాధి పథకానికి మళ్లీ మహాత్మా గాంధీ పేరు పెట్టండి. పేదలకు ఎలాంటి నష్టం జరగకుండా, పథకానికి పూర్తి కేంద్ర నిధులు కొనసాగించండి“ అని తమిళనాడు సీఎం విజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
